రైలులోంచి జారిపడి యువకుడి మృతి..! తల మహారాష్ట్రలో...మొండెం తెలంగాణలో.!

కదులుతున్న రైలులోంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు.ఈ ఘటన రెండు రాష్ట్రాల రైల్వే పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.

 Man Slipped From Trainbody Parts Separated-TeluguStop.com

వివరాల్లోకి వెళితే…

జనగామ-రఘనాథపల్లి స్టేషన్ల మధ్య గుర్తు తెలియని యువకుడి మొండెం ఇతర శరీరభాగాలు నుజ్జు నుజ్జయి కనిపించాయి.తల కోసం ఎంతగా గాలించిన రైల్వే పోలీసులకు ఎక్కడా దొరకలేదు.

దీంతో మొండెంను వరంగల్ ఎంజీఎంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వేస్టేషన్ సిబ్బంది రైలు మెట్లకు ఓ యువకుడి తల చిక్కుకుని ఉండటాన్ని గుర్తించి భయాందోళనలకు గురయ్యారు.వెంటనే విషయాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు.

మొదట్లో పోలీసులు ఇది హత్యగా భావించారు.సికింద్రాబాద్ – నాగపూర్ మధ్యలోని అన్ని రైల్వేపోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.దీంతో రఘనాథపల్లి వద్ద దొరికిన మొండెం తాలుకూ తలేనని ఖాజీపేట రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు.మృతి చెందిన ఆ యువకుడు సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మెట్ల వద్ద కూర్చొని ప్రయాణించాడని పోలీసులు తెలిపారు.

అతను ఎవరు అనే వివరాలు తెలీలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube