చంద్రబాబు తోడల్లుడు, మాజీ టీడీపీ నాయకుడు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు, తన కుమారుడుతో కలిసి వైసీపీలో చేరబోతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ విషయాన్నీ గతంలో అతను అధికారికంగా దృవీకరించారు.
ప్రస్తుతం దగ్గుబాటి భార్య పురందరేశ్వరి బీజేపీలో వుండగా భర్త, కుమారుడు వైసీపీలో చేరడానికి నిర్ణయించుకోవడం విశేషం.ఈ చేరికపై గతంపై చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శలు చేసారు.
అయితే వాటికి పురందరేశ్వరి ఘాటుగా సమాధానాలు చెప్పింది.
ఇదిలా వుంటే దగ్గుబాటి తన కుమారుడు చెంచురాంతో కలిసి వైసీపీలో చేరడానికి ఈ నెల 27న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు.
ఆ రోజు అఫీషియల్ గా తాము జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేసారు.ఇక దగ్గుబాటి తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది.
రాబోయే ఎన్నికలలో తన కుమారుడుని పార్లమెంట్ బరిలో నిలపాలని దగ్గుబాటి ఆలోచనగా తెలుస్తుంది.మరి వారి రాజకీయ భవిష్యత్తుకి జగన్ నుంచి ఎంత వరకు సహకారం అందుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.