కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో క్రిష్ దర్శకత్వంలో ఝాన్సి లక్ష్మి భాయ్ జీవిత కథ మణికర్ణిక టైటిల్ తో తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే.ఇక ఈ సినిమా షూటింగ్ చివర్లో కంగనాతో విభేదాలు కారణంగా క్రిష్ దర్శకత్వం నుంచి బయటకి వచ్చేసాడు.
తరువాత కంగనా సినిమా దర్శకత్వ బాద్యతలు చేపట్టి సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేసింది.అయితే సినిమా రిలీజ్ తర్వాత మణికర్ణిక క్రెడిట్ మొత్తం కంగనా తీసుకుంది.
ఈ విషయంలో క్రిష్, కంగనాపై విమర్శలు చేసాడు.ఒకరి క్రెడిట్ దొబ్బెయడం దారుణం అని వాఖ్యలు చేసాడు.
ఆ టైం లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొద్ది రోజులు నడిచింది.
ఇదిలా వుంటే తాజాగా ఎన్టీఆర్ జీవిత కథతో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకొని బాలకృష్ణ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలుగా నిలిచాయి.
ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటిభాగం కథానాయకుడు కొంత ఒకే అనుకున్న మహానాయకుడు అయితే మరీ దారుణంగా థియేటర్ రెంట్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది.ఈ నేపధ్యం కంగనా మరో సారి క్రిష్ పై విమర్శలు చేసింది.
ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ చేసి క్రిష్ హీరో ఇమేజ్ ని దారుణంగా నాశనం చేసాడని అన్నారు.క్రిష్ మీద బాలకృష్ణ నమ్మకం పెడితే ఫలితం అలా వచ్చిందని, అయితే అతని డైరెక్షన్ విషయంలో నమ్మకం లేక అతని దూరం పెట్టా అని చెప్పుకొచ్చింది.
మరి దీనిపై క్రిష్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి
.