జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం కర్నూల్ లో జరిగిన బారీ బహిరంగ సభలో చేసిన ప్రసంగం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండు పోటాపోటీగా తలపడే అవకాశాలు వున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపధ్యంలో మూడో ప్రత్యామ్నాయంగా వున్నా జనసేన కచ్చితంగా ఏపీలో కింగ్ మేకర్ అవుతుందని కూడా బలంగా చెబుతున్నారు.అయితే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ వైపు తాము భారీ మెజార్టీతో గెలుస్తామని చెబుతున్న లోపల మాత్రం కాస్తా టెన్సన్ తో వున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే జనసేనని చేరువ చేసుకోవాలని ఆశ పడుతున్నారు.
ఇదిలా వుంటే పవన్ కళ్యాణ్ నిన్న కర్నూల్ వేదికగా ఇచ్చిన ప్రసంగంలో మరో సారి స్పష్టంగా తాను ఎ పార్టీతో పొట్టు పెట్టుకోనని బలంగా చెప్పాడు.
అలాగే ఏపీలో జనసేన లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి కూడా లేదని కూడా చెప్పడంతో పాటు, తమ లక్ష్యం సంకీర్ణ ప్రభుత్వం అని, అలా అయితే అధికారంలో వున్న పార్టీలు సక్రమంగా పనులు చేస్తుందని, మేడలు వచ్చి జనసేన వారితో పనులు చేయిస్తుంది అని వాఖ్యలు చేసారు.దీనిని బట్టి ఏపీలో తెలుగు దేశం, వైసీపీ ఎవరు అధికారంలోకి వచ్చిన కచ్చితంగా ఈ సారి పవన్ కళ్యాణ్ వారికి ఓ వైపు ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు ఇస్తూనే మరో వైపు ప్రజల సంక్షేమం విషయంలో ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం వుందని స్పష్టంగా తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.