బెంగళూరులో ఏరో ఇండియా షోలో పార్కింగ్ ప్రదేశం లో నిన్న మధ్యాహ్నం జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటన మరువకముందే మరో సారీ అలాంటి అగ్నిప్రమాదం చెన్నై లో చోటు చేసుకుంది.చెన్నైలో రామచంద్ర హాస్పిటల్ సమీపంలో పార్కింగ్ ప్రదేశం లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రెండు వందలకు పైగా కార్లు దగ్ధమైనట్లు తెలుస్తుంది.
ఈరోజు సాయంత్రం ఊహించని విధంగా జరిగిన అగ్నిప్రమాదం నిలువరించేందుకు 5 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఈ భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది కంట్రోల్ చేయలేక పోతున్నట్లు తెలుస్తోంది.
ఈ అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రజలు చిక్కుకున్నట్లు తెలుస్తుంది.అయితే చెలరేగిన మంటలను పూర్తిగా కంట్రోల్ చేసేంతవరకు ప్రమాద తీవ్రత ఎంత అనేది తెలుసా అవకాశం లేదు.