కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ నేడు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరాడు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఇక టిడిపిలో చేరిన తర్వాత కిషోర్చంద్రదేవ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
అదే సమయంలో 2019 ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తుందని బిజెపి నాయకత్వం లో ఎన్డీఏ కూటమికి కనీసం వంద సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడినుంచి పోటీ చేస్తాను అనే విషయంలో కిశోర్చంద్రదేవ్ క్లారిటీ ఇవ్వలేదు.అయితే కిషోర్ చంద్ర దేవ్ టిడిపిలో చేరడం నేషనల్ కాంగ్రెస్ ఆదేశాల ప్రకారమే జరిగిఉంటుందని అభిప్రాయం ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తమవుతుంది.