పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వారణాసి సమీపంలో భాదోహి ప్రాంతంలో ఓ కార్పెట్ తయారి పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.శనివారం మధ్యాహ్నం సమయంలో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చుట్టూ ముట్టి మొత్తం వ్యాపించేసింది.
ఇక మంటలు పైకి ఎగసిపడుతూ వుండటంతో సమీపంలో ప్రజలు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
పరిశ్రమ మొత్తం మాటలు వ్యాపించడంతో బిల్డింగ్ కూడా కూలిపోయినట్లు తెలుస్తుంది.
ఇదిలా వుంటే అగ్నిప్రమాదం జరిగే సమయంలో ఆ ఫ్యాక్టరీలో ఓ 11 మంది వర్కర్స్ వున్నట్లు తెలుస్తుంది.
వారిలో ఇప్పటికే మంటల్లో చిక్కుకొని నలుగురు చనిపోయినట్లు ఫైర్ సిబ్బంది నిర్ధారించారు.మరో ముగ్గురు తీవ్ర గాయాలతో వుండటంతో వారిని హాస్పిటల్ కి తరలించారు.ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని తెలుస్తుంది.అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంలో ఇప్పటి వరకు పోలీసులకి ఎలాంటి సమాచారం లేకపోయినా, బాంబ్స్ స్టోర్ చేసి వుండటంతో అవి బ్లాస్ట్ అవడం ద్వారా ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
అయితే మంటలు పూర్తిగా అదుపు చేసిన తర్వాత అసలు ఈ అగ్నిప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు తెలిసే అవకాశం వుందని పోలీసులు తెలియజేస్తున్నారు.