మనసుంటే మార్గం ఉంటుంది.ఏదైనా మనసు పెట్టి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని, ఆ ఫలితానికి తగిన గుర్తింపు దక్కుతుందని సత్యజిత్ మిట్టల్ నిరూపించాడు.
పుణె ఎమ్ఐటీ స్టూడెంట్ అయిన సత్యజిత్ వినూత్నమైన టాయిలెట్ బేషన్ను తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు.ఇప్పటికే ఉన్న టాయిలెట్ బేషన్స్ కొందరికి ఇబ్బంది కరంగా ఉంటున్నాయి.
ముఖ్యంగా ముసలి వారికి మరియు అంధులకు టాయిలెట్ బేషన్స్ కష్టంగా ఉన్న నేపథ్యంలో సత్యజిత్ వినూత్నమైన ప్రయోగం చేశాడు.
ఒక్క ప్రయోగంతో ఇద్దరికి ఉపయోగదాయకంగా ఉండేలా ఆయన ప్లాన్ చేశాడు.కాళ్ల నొప్పులు ఉన్న వృద్దులు సాదారణ బేషన్ పై కూర్కోవడానికి చాలా ఇబ్బంది పడతారు.అందుకే వారి కోసం అని మడమల కింద కాస్త ఎత్తుగా ఉండటంతో పాటు, ఏటవాలుగా ఉండేలా బేషన్ను డిజైన్ చేయడం జరిగింది.
ఇది కేవలం వృద్దులకు మాత్రమే కాకుండా అందరికి కూడా ఉపయోగదాయకం అంటూ సత్యజిత్ చెబుతున్నాడు.మోకాళ్ల నొప్పులు రాకుండా, మోకాళ్ల నొప్పులు ఉన్న వారికి ఇది మంచిదని చెబుతున్నాడు.
వైధ్యులు కూడా దీన్ని దృవీకరిస్తున్నారు.
ఇక అంధులకు గుర్తుంచే విధంగా ముందు భాగంగా కాస్త గరుకులుగా ఉండే మెటల్ను వాడాడు.దాంతో వారు ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది.అందుల కోసం మరియు వృద్దుల కోసం సత్యజిత్ తయారు చేసిన ఈ కొత్త టాయిలెట్ బేషిన్కు విదేశాల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ బేషిన్కు పేటెంట్ హక్కును తీసుకునేందుకు సత్యజిత్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇలాంటి విభిన్నమైన ఎన్నో ప్రయోగాలను ఆయన చేసేందుకు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.పలు అవార్డులు అందుకున్న సత్యజిత్ సక్సెస్ స్టోరీ అందరికి ఆదర్శం.సత్యజిత్ గురించి నలుగురికి తెలిసేలా ఈ విషయాన్ని షేర్ చేయండి.