బెల్లంకొండ హీరో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు.అయితే ఏ ఒక్కటి కూడా ఈయనకు సక్సెస్ను తెచ్చి పెట్టడం లేదు.
ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలు కూడా అరాకొరా సక్సెస్లను తెచ్చి పెట్టాయి.కాని ఒక్కటి కూడా గట్టి కమర్షియల్ సక్సెస్ను తెచ్చి పెట్టలేదు.
అయినా కూడా ప్రయత్నాలు ఆపకుండా భారీ చిత్రాలను చేస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘సీత’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ చిత్రం తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో ‘రాక్షసన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.ఆ చిత్రం ఇటీవలే పట్టాలెక్కింది.
తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
‘ఆర్ఎక్స్ 100’ చిత్రం దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందబోతుంది.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించబోతున్న ఆ చిత్రంకు ఇప్పటికే మహాసముద్రం అనే టైటిల్ ఫిక్స్ అయ్యింది.ఈ చిత్రంలో బెల్లంకొండతో పాటు మరో హీరో కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఆ వార్తల్లో నిజం ఎంతో కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్స్గా సమంత మరియు రకుల్ ప్రీత్ సింగ్లను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
వీరిద్దరు కూడా గతంలో బెల్లంకొండ శ్రీనివాస్తో నటించిన వారే.మరో సారి వీరిద్దరు బెల్లంకొండ బాబుతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే ఆశ్చర్యంగా ఉంది.హీరోయిన్స్ ఎలా బెల్లంకొండకు ఓకే చెబుతున్నారు అంటూ ఇతర యంగ్ హీరోలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.
భారీగా పారితోషికం ఇవ్వడం వల్లే వారు ఒప్పుకుంటున్నారనేది కొందరి వాదన.అయితే కొందరు హీరోలు ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా కూడా ఆ హీరోయిన్స్ మాత్రం ఒప్పుకోరు.కాని బెల్లంకొండకు ఎలా ఓకే చెబుతున్నారో వారికే తెలియాలి.