రెండేళ్ల క్రితం రకుల్ ప్రీత్ సింగ్తో నటించేందుకు స్టార్ హీరోలు అందరు కూడా ఆసక్తి చూపించారు.అయితే ఆ సమయంలో ఆమె మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలను కూడా డేట్లు ఖాళీ లేక చేయలేక పోయింది.
కాలం రెండు సంవత్సరాలు తిరిగేప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.ప్రస్తుతం స్టార్ హీరోల సంగతి ఏమో కాని ఏదో ఒక ఆఫర్ వచ్చినా చాలు అన్నట్లుగా ఉంది.
మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తుంది.తెలుగులో ఈమెకు గత ఏడాదిగా ఆఫర్లే లేవు.
నాగచైతన్యతో ‘వెంకీమామ’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
‘వెంకీ మామ’ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆమెకు వచ్చిన అవకాశం కూడా కోల్పోయింది.రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం క్రేజ్ లేని హీరోయిన్.అలాంటి హీరోయిన్ తమకు వద్దనుకున్న బాబీ తమ సినిమాలో రకుల్ స్థానంలో పాయల్ రాజ్పూత్ను చైతూకు జోడీగా ఎంపిక చేయడం జరిగింది.
వెంకటేష్కు జోడీగా అంటూ మొదట వార్తలు వచ్చినా కూడా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకీకి జోడీగా శ్రియ నటించనుండగా, చైతూకు జోడీగా పాయల్ రాజ్ పూత్ నటించబోతుంది.మరి కొన్ని రోజుల్లో ఆ మూవీ పట్టాలెక్కబోతుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది.
ఈ సమయంలోనే ఈమెకు ‘మన్మధుడు 2’ చిత్రంలో ఛాన్స్ దక్కినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాహుల్ రవీంద్రన్ ఈమెతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది.చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న రాహుల్ తదుపరి చిత్రాన్ని నాగార్జునతో మన్మధుడు 2 టైటిల్తో చేయబోతున్నాడు.
త్వరలోనే యూరప్లో చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది.నాగార్జునకు జోడీగా రకుల్ను ఎంపిక చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
కొడుకుతో నటించిన రకుల్ ఇప్పుడు తండ్రితో నటించేందుకు సిద్దం అయ్యింది.ఇది చాలా అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు.