తెలంగాణలో ఎన్నికల తర్వాత మంత్రి వర్గం ఏర్పాటుపై ద్రుష్టి పెట్టిన కేసీఆర్ మొత్తానికి ఆ పని పూర్తి చేసి, మొదటి క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహించేసారు.దీంతో ఇకపై పరిపాలనపై ద్రుష్టి పెట్టడానికి రెడీ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి రెడీ అవుతున్నాడు.
ఈ రోజు 11 గంటల తర్వాత అసెంబ్లీ సమావేశాలలో మొదటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.అయితే ఈ ఆరు నెలల కాలానికి ముందుగా ఓటాన్ బడ్జెట్ ని ఏర్పాటు ప్రవేశ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
అసెంబ్లీ లో బడ్జెట్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టగా, మండలిలో ఈటెల రాజేందర్ ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా వుంటే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్ 2.02 లక్షల కోట్లుగా తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది.దీనిలో ప్రణాళికేతర బడ్జెట్ వ్యయం అంచనా 1.5 లక్షల కోట్లుగా వుండగా, ప్రణాళిక వ్యయం అంచనా 40 వేల కోట్లుగా నిర్ణయించారు.అలాగే నీటి పారుదల కోసం 23 వేల కోట్లు కేటాయించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇక మేనిఫెస్టో లో అమలు చేస్తామని చెప్పిన పెరిగిన పెన్సన్స్ ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ ఆర్ధిక సంవత్సరం కోసం పూర్తి స్థాయి బడ్జెట్ తో కంటే ఆరు నెలల ఓటాన్ బడ్జెట్ తో కేసీఆర్ కొత్త ప్రభుత్వం పరిపాలనని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.