ప్రస్తుతానికి ఏపీ అధికార పార్టీ టిడిపి కి కొంతమేర అనుకూల వాతావరణం ఉన్నట్టే కనిపిస్తున్నా… వాస్తవ పరిస్థితి మాత్రం ఏ మాత్రం బాగోలేదని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఇంకా అనేక సర్వేల ద్వారా బాబుకు అందుతున్న సమాచారం.మరో వైపు చూస్తే పార్టీలో ఉన్న కీలక నాయకులంతా… తమ ప్రత్యర్థి పార్టీ అయినా వైసీపీ లోకి జంప్ చేస్తున్నారు.
ఇక జాతీయ స్థాయిలో కూడా బాబు ని టార్గెట్ చేసుకుంటూ… రాజకీయాలు నడుస్తున్నాయి.ఈ నేపథ్యంలో గెలుపు కోసం బాబు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
అందుకే ఇప్పుడు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చూస్తున్నాడు.దీనిలో భాగంగానే… అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.అందుకే… సిపిఐ, సిపిఎం కలిసి ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో టీడీపీ అధినేత ఉన్నాడు.
ప్రస్తుతం ఈ రెండు పార్టీలు జనసేన వైపు చూస్తున్నాయి.ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీ చేసి ఎన్నో కొన్ని సీట్లు సంపాదించాలనే ఆలోచనలో ఉన్నాయి.గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికలకు వెళ్లారు.
అయితే ప్రస్తుతం ఏపీ లో వైసీపీ బాగా బలపడుతున్న నేపథ్యంలో… గత స్నేహాలను గుర్తు చేసి వామపక్ష పార్టీలను చేరదీయాలని బాబు చూస్తున్నాడు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది .అయితే బాబు ప్రతిపాదనకు ఈ మూడు పార్టీలు ఒప్పుకుంటాయా లేదా అనేది పెద్ద సందేహంగా ఉంది.ముఖ్యంగా వామపక్ష పార్టీలు ఈ విషయంలో ముందడుగు వేస్తాయా లేదా అనేది పెద్ద సందేహమే.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో కలిసి వామపక్ష పార్టీలు అధికారం పంచుకునేందుకు సిద్ధం అయ్యాయి.ఇప్పటికే సీట్ల పంపిణీ అంశంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.ఈ దశలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ మూడు పార్టీలకు ఏ మేరకు లాభం కలుగుతుందో చూడాలి .సిపిఐ సిపిఎం జాతీయ స్థాయి నాయకులను ఇదే విషయంలో కలిసి వారిని ఒప్పించేందుకు బాబు తమ పార్టీ సీనియర్ నాయకులతో రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.అయితే జాతీయ స్థాయిలో స్నేహానికి ఆ రెండు పార్టీల అగ్రనేతలు సుముఖంగానే ఉన్నా… ఏపీలో మాత్రం ఆ పార్టీ నాయకులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.అయితే బాబు మాత్రం పట్టు వీడకుండా… పొత్తు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.