టాలీవుడ్ లో బడా నిర్మాత అయిన తండ్రి అండదండలతో హీరోగా అరంగేట్రం చేసి, కెరియర్ ఆరంభం నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్.తన ప్రతి సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా వుండటంతో పాటు స్టార్ హీరోయిన్ తో ఆడిపాడే విధంగా, ప్లాన్ చేసుకుంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో ఆరు సినిమాలు చేసిన అందులో ఒక్కటి కూడా సక్సెస్ లేదు.
అయిన కూడా ఎ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఈ కుర్ర హీరో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోతున్నాడు.రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా డిమాండ చేయకుండా తన రెమ్యునరేషన్ కూడా సినిమా బడ్జెట్ గా ఉపయోగించుకోవాలని నిర్మాతలకి బంపర్ ఆఫర్ ఇవ్వడంతో బెల్లంకొండతో సినిమాలు చేయడానికి నిర్మాతలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇదిలా వుంటే ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత అనే సినిమాలో కాజల్ తో ఆడిపాడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం మొదలెట్టేసాడు.ఇప్పటికే ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో సినిమాని ఒకే చేసుకొని సెట్స్ పైకి ఎక్కించడానికి రెడీ అయిన శ్రీనివాస్ తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా లాంచ్ చేసేసాడు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈ రోజు మొదలయ్యాయి.ఇది తమిళ హిట్ మూవీకి రీమేక్ అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.గతంలో నాని, తనిష్ కాంబినేషన్ లో రైడ్ తో దర్శకుడుగా పరిచయం అయిన రమేష్ వర్మ తెరకేక్కిస్తూ వుండగా, ఈ సినిమాని మరో టాలీవుడ్ హీరో హవీష్ నిర్మిస్తున్నాడు.ఇక ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం హీరోయిన్స్ ని ఫైనల్ చేసే పనిలో వున్న దర్శకుడు అది పూర్తి కాగానే సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం వుందని తెలుస్తుంది.