పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవాను పంకజ్ కుమార్ త్రిపాఠి తాను అస్తమించి కూడా తన ఊరికి వెలుగులు తెప్పించాడు.ఉత్తర్ప్రదేశ్-నేపాల్ సరిహద్దులోని మారుమూల ప్రాంతమైన మహరాజ్గంజ్లో ప్రభుత్వ సహకారం అంతంతమాత్రంగానే ఉండేది.
పంకజ్ కుమార్ స్వస్థలంలో ప్రాథమిక పాఠశాల కూడా ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉంది.గ్రామస్థులు మొర పెట్టుకున్నా అధికారులు పట్టించుకోలేదు.పంకజ్ కుమార్ త్రిపాఠి వీరమరణంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్తోపాటూ ఉన్నతాధికారులు ఆ ఊరికి రావడంతో, ఒక్కసారిగా ఆ ఊరిపై అధికారుల దృష్టిపడింది.పాఠశాల పునర్నిర్మాణపనులు చకచకా ప్రారంభమయ్యాయి.
పాఠశాల పేరును కూడా పంకజ్ త్రిపాఠి పేరుగా మార్చారు.అంతేకాదు ఊరిలో రోడ్ల మరమత్తులు కూడా మొదలుపెట్టారు.
ఆదిత్యనాథ్ ఆదివారం పంకజ్కుమార్ కుటుంబసభ్యులను పరామర్శించారు.పంకజ్చిత్రపటానికి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆ ఊర్లో పరిస్థితులను గమనించిన ఆదిత్యనాథ్ వారికి ప్రభుత్వం తరపున మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీఇచ్చారు.