అమెరికాలో రాజధాని వాషింగ్టన్ లో హైస్కూల్ చదివే యువకుడు ప్రముఖ మీడియా సంస్థ “వాషింగ్టన్ పోస్ట్” పై కెంటకీ జిల్లా కోర్టులో పరువు నష్టం దావా వేశాడు.ప్రతివాడ మీడియా సంస్థ నుంచీ తనకు దాదాపు తనకు 250 మిలియన్ డాలర్ల నష్ట పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు.అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు రూ .1778,87,50,000 పరిహారం ఇప్పించాలని న్యాయస్థానాన్ని ఆశ్ర్రయించాడు.
అయితే ఆ బాలుడి తరుపు న్యాయవాదులు లిన్వూడ్,టాడ్ మెక్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.నికోలస్ సాండ్మన్ అనే 16 ఏళ్ల కుర్రాడు, కోవింగ్టన్ క్యాథలిక్ హైస్కూల్ లో చదువుతున్నాడు.
అయితే సహచర విద్యార్థులతో కలిసి గతనెల 18న వాషింగ్టన్లోని లింకన్ మెమోరియల్ కి వెళ్ళాడు.అక్కడ ఆసమయంలో ఒమాహా జాతీయుడు, హక్కుల కార్యకర్త నాథన్ ఫిలిఫ్స్ లింకన్ కనపడగా
ఆ కుర్రాడు ఆయనతో నవ్వుతూ మాట్లాడిన ఫోటో ని తీసిన వాషింగ్టన్ పోస్ట్ తన పత్రికలో ప్రచురించింది.అయితే, నాథన్లో ఉన్న జాత్యహంకార భావాలు సాండ్మన్ అనే విద్యార్థిలోనూ ఉన్నాయని ఓ కధనంగా తెలిపింది.దాంతో అతడిని అందరూ గేలి చేయడం మొదలు పెట్టారు.
దాంతో మస్తపానికి చెందిన అతడు.వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థ పై పరువు నష్టం దావా వేశాడు.