ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ ముఖ్యామంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి.తెలుగు దేశం పార్టీపై ప్రజలలో వ్యతిరేకత వుందని గ్రహించిన నేతలు వైసీపీలోకి జంప్ చేస్తూ టికెట్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబు లాంటి నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయారు.అయితే చంద్రబాబుకి పెద్ద ఎదురుదెబ్బ ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి తగిలింది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, అతని కొడుకు చెంచురాం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇదిలా వుంటే తాజాగా చంద్రబాబుకి మరో ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పాలి.
జూనియర్ ఎన్టీఆర్ కి ఎన్ స్టూడియోస్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తెతో చంద్రబాబు సంబంధం సెట్ చేసి పెళ్లి చేసాడు.కేవలం తారక్ వైపు నుంచి మాత్రమె కాకుండా చంద్రబాబుకి నార్నే శ్రీనివాసరావు సమీప బంధువు అని అందరికి తెలిసిందే.
గత ఎన్నికలలో టీడీపీ నుంచు గుంటూరు టికెట్ ఆశించిన నార్నేకి చంద్రబాబు షాక్ ఇచ్చాడు.దీంతో ఇన్ని రోజులు రాజకీయాలకి దూరంగా వున్నా నార్నే ఊహించని విధంగా తాజా గా హైదరాబాద్ లోటస్ ఫండ్ లో జగన్ తో బేటీ అయ్యారు.
తనకి గుంటూరు టికెట్ కేటాయించాలని, అలా అయితే వైసీపీలో చేరుతా అని నార్నే జగన్ ని కోరినట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయంపై జగన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదని సమాచారం.
ఒక వేళ గుంటూరు కాకున్నా వేర్కొన సీటు కేటాయించిన నార్నే వైసీపీలో చేరడానికి సుముఖంగా వున్నట్లు టాక్ వినిపిస్తుంది.అదే జరిగితే సన్నిహితుడు నుంచి చంద్రబాబు భారీ ఎదురుదెబ్బ తిన్నట్లే అని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.