బాలకృష్ణ, క్రిష్ల కాంబినేషన్లో ‘ఎన్టీఆర్’ మూవీ అనగానే అంచనాలు ఆకాశానికి తాకాయి.తెలుగు వారి ఆత్మగౌరవంను ప్రపంచానికి చాటిన తెలుగు దేశం అధినేత, సినీ దిగ్గజం ఎన్టీ రామారావు చరిత్రను వెండి తెరపై చూబోతున్నందుకు సంతోషం అంటూ నందమూరి ఫ్యాన్స్ మరియు అంతా కూడా ఆనందం వ్యక్తం చేశారు.
తప్పకుండా ఎన్టీఆర్ బయోపిక్ను క్రిష్ చక్కగా తెరకెక్కిస్తాడని అంతా నమ్మకం పెట్టుకున్నారు.అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ బయోపిక్లోని పిక్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలు ఆకాశాని తాకేలా చేశాయి.
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంకు మంచి టాక్ వచ్చింది.వర్మ చేసిన హడావుడి కారణంగా కథానాయకుడు చిత్రం ఏమాత్రం కలెక్షన్స్ను రాబట్టలేక పోయింది.ఇక కీలకమైన మహానాయకుడు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది.ఇలాంటి సమయంలో వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ను విడుదల చేశాడు.లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్తోనే వర్మ తన సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో పోల్చితే మహానాయకుడు సినిమా తేలిపోవడం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పూర్తి వివాదాస్పద అంశాలు మాత్రమే ఉండబోతున్నాయి.ఇక మహానాయకుడు చిత్రంలో మాత్రం ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా తెరకెక్కించారు.మహానాయకుడు చిత్రంలో అసలు లక్ష్మీ పార్వతి ముచ్చటే ఉండదట.ఎన్టీఆర్ జీవితంలో అత్యంత కీలకమైన లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ను వదిలేయడం వల్ల మహానాయకుడు చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి లేదు.
మహానాయకుడు సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకం లేదు.కనీసం కథానాయకుడుకు వచ్చిన కలెక్షన్స్ అయినా వస్తాయా అనేది నమ్మకం తక్కువే అంటున్నారు.ఎన్టీఆర్కు నిర్మాత అయిన బాలయ్య ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ దెబ్బకు విలవిలలాడిపోతున్నాడు.