తెలంగాణలోని కొన్ని గ్రామాల్లో ఇప్పుడు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.ఎందుకంటే… కొత్తగా ఎన్నికైన సర్పంచులను వెతుక్కుంటూ కొంతమంది నాగ సాధువులు గ్రామాల్లో పర్యటించడం కలకలం రేపుతోంది.ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వీరి సంచారం ఎక్కువగా ఉంది.ఇది కాస్తా వైరల్ గా మారడంతో కొంత మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
ముఖ్యంగా ఈ నాగసాధువుల బృందం గ్రామాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులను టార్గెట్ గా చేసుకుని వారి ఇంటికి వెళ్లి పూజలు పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
సొమ్ములు ఇవ్వని వారిని శాపనార్థాలు పెడుతూ …భయబ్రాంతులకు గురి చేస్తున్నారని కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు.అయితే అసలు నాగ సాధువులు కొత్త సర్పంచులను టార్గెట్ చేసుకోవడం వెనుక కారణం ఏంటి అనే విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.