టీడీపీకి షాక్ ఇచ్చిన అనకాపల్లి ఎంపీ! త్వరలో వైసీపీ గూటికి!

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ నాయకుల పార్టీల జంపింగ్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.కాంగ్రెస్ నుంచి టీడీపీ, వైసీపీ గూటికి కొంత మంది రావడానికి రెడీ అవుతూ వుంటే, అధికార టీడీపీ నుంచి కొంత మంది ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి షాక్ ఇస్తున్నారు.

 Tdp Anakapalli Mp Resigned To Tdp Party-TeluguStop.com

ప్రస్తుతం టీడీపీ పార్టీకి ఏపీలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు, వైసీపీ సానుకూల పవనాలు వీస్తున్నాయి.ఈ నేపధ్యంలో అధికార టీడీపీ పార్టీని వీడి వైసీపీలోకి చేరడానికి చాలా మంది నాయకులు సిద్ధం అవుతున్నారు.

జనసేనలో జంపింగ్ లకి పెద్దగా అవకాశం లేకపోవడంతో వారు ముందుగా వైసీపీ వైపే చూస్తున్నారు.ఒక్క రోజులోనే చంద్రబాబుకి తెలుగు దేశం పార్టీ నుంచి రెండు షాక్ లు తగిలాయి.

ఈ రోజు ఉదయం చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలోకి చేరడానికి రెడీ అయిపోయారు.టీడీపీకి రాజీనామా చేస్తూనే ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు కూడా చేసారు.

వయసుతో పాటు బాబుకి మతిమరుపు కూడా పెరిగిందని విమర్శించారు.ఇదిలా వుంటే ఇంతలో మరో తెలుగు దేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసారు.

ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన అవంతి శ్రీనివాస్ తరువాత టీడీపీలోకి వచ్చి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.ఆ మధ్య జనసేన పార్టీలోకి వెళ్ళడానికి అవంతి శ్రీనివాస్ ప్రయత్నాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ నుంచి సమ్మతం లభించకపోవడంతో ఇప్పుడు అవంతి ప్రత్యామ్నాయం చూసుకున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన అవంతి త్వరలో వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ సారి వైసీపీ నుంచి భీమిలి అసెంబ్లీ అభ్యర్ధిగా బరిలో దిగాలనే ప్రయత్నంలో వున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube