ప్రముఖ నిర్మాత జయశ్రీ దేవి మృతి! దిగ్బ్రాంతికి గురైన ప్రముఖులు!

ప్రముఖ తెలుగు, కన్నడ నిర్మాత, స్టార్ హీరోలతో సినిమాలని తెరకెక్కించిన నిర్మాత జయశ్రీ దేవి ఆకస్మికంగా హైదరాబాద్ లో మృతి చెందారు.ఆమె వయసు అరవై ఏళ్ళు, తెలుగులో శ్రీ మంజునాథ, చంద్రవంశం, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర్ వంటి సినిమాలని ఆమె నిర్మించారు.

 Telugu Star Producer Jayasri Devi Passed Away-TeluguStop.com

తెలుగు, కన్నడ సినిమా ఇండస్ట్రీలలో ప్రముఖులతో ఆమెకి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి.ఆమె చివరిగా కన్నడలో గోపాల గోపాల సినిమాని రీమేక్ చేసారు.

ఈ సినిమాలో కిచ్చా సుదీప్, ఉపేంద్ర నటించారు.కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలిచింది.

ఇదిలా వుంటే హైదరాబాద్ లో వున్నా జయశ్రీ దేవి తీవ్ర గుండె నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈమె మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.ఆమె మృతికి సంతాపం తెలియజేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube