ప్రముఖ తెలుగు, కన్నడ నిర్మాత, స్టార్ హీరోలతో సినిమాలని తెరకెక్కించిన నిర్మాత జయశ్రీ దేవి ఆకస్మికంగా హైదరాబాద్ లో మృతి చెందారు.ఆమె వయసు అరవై ఏళ్ళు, తెలుగులో శ్రీ మంజునాథ, చంద్రవంశం, వందేమాతరం, జగద్గురు ఆదిశంకర్ వంటి సినిమాలని ఆమె నిర్మించారు.
తెలుగు, కన్నడ సినిమా ఇండస్ట్రీలలో ప్రముఖులతో ఆమెకి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి.ఆమె చివరిగా కన్నడలో గోపాల గోపాల సినిమాని రీమేక్ చేసారు.
ఈ సినిమాలో కిచ్చా సుదీప్, ఉపేంద్ర నటించారు.కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలిచింది.
ఇదిలా వుంటే హైదరాబాద్ లో వున్నా జయశ్రీ దేవి తీవ్ర గుండె నొప్పితో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు.ఇక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈమె మరణ వార్త తెలిసిన వెంటనే తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.ఆమె మృతికి సంతాపం తెలియజేసారు.