చివరి క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు!

ఏపీ గవర్నమెంట్ క్యాబినెట్ చివరి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మరో నెల రోజులో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం వున్న నేపధ్యంలో క్యాబినెట్ బేటీలో చంద్రబాబు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు.

 Ap Cabinet Took Important Decision Last Cabinet Meeting-TeluguStop.com

వీటిలో ముఖ్యంగా జర్నలిస్ట్ లకి స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకున్న చంద్రబాబు వారికి ఎకరా 30 లక్షల చొప్పున 30 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.అలాగే ఎన్జీవో, ఏపీ సచివాలయం ఉద్యోగులకి గతం నాలుగు వేలు చొప్పున 230 ఎకరాల స్థలం కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే అన్నదాత సుఖీభవ పథకం క్రింద రైతులకి అందించాలని నిర్ణయించుకున్న ఆర్ధిక సహాయంని రెండు విడతలలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం ఇచ్చే ఆరు వేల ఆర్ధిక సహాయంకి అదనంగా నాలుగు వేలు కలిపి ఎకరాకి పది వేల ఆర్ధిక సహాయం రైతులకి అందించడానికి క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.

ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకి ఇచ్చిన పది వేల రూపాయిల చెక్కులపై కూడా క్యాబినెట్ లో చర్చించారు.మొత్తానికి సిఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలతో చివరి క్యాబినెట్ సమావేశాన్ని ముగించి ఎన్నికల రణరంగంలో ప్రజల ఓటు కోసం సిద్ధం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube