టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనగానే కాజల్ మరియు తమన్నా పేర్లు ముందు వరుసలోనే ఉంటాయి.ప్రస్తుతం వీరిద్దరు కాస్త డల్ అయ్యారు కాని వీరిద్దరు దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఆడి పాడిన విషయం తెల్సిందే.
వీరిద్దరు ఇంకా కూడా కెరీర్లో టాప్ స్టార్స్గా ఉండేందుకు తెగ కష్టపడుతున్నారు.అదృష్టం బాగుండి కాజల్కు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
కాజల్కు చిన్న చితకా ఆఫర్లు వస్తున్నా ఆమె గట్టి ప్రయత్నాలే చేస్తుంది.ముద్దుగుమ్మలు ఇద్దరు కూడా ప్రస్తుతం తమిళం, తెలుగు అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
ఈ సమయంలోనే వీరిద్దరు కలిసి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అయ్యారు.విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న ప్రశాంత్ వర్మ ఒక కథతో కాజల్ను ఇంప్రెస్ చేశాడట.ఎంతగా అంటే స్వయంగా ఆమె నిర్మించేందుకు ముందుకు వచ్చేంత.కాజల్ సొంత నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి తెలుగులో ఆ చిత్రాన్ని నిర్మించబోతుంది.త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది.కాజల్ తో పాటు ఈ చిత్ర నిర్మాణంలో తమన్నా కూడా పాలు పంచుకోబోతుందట.
కాజల్ అధికారికంగా నిర్మాతగా వ్యవహరించగా, తమన్నా మాత్రం స్లీపింగ్ పార్టనర్గా ఉండబోతుందట.తమన్నా ఈ చిత్రం కోసం 30 శాతం బడ్జెట్ పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.రెండున్నర నుండి మూడు కోట్ల బడ్జెట్తో అంతా కొత్త వారిని తీసుకుని సినిమాను నిర్మించేందుకు వీరిద్దరు ప్రణాళిక సిద్దం చేశారు.
దర్శకుడు ప్రశాంత్పై నమ్మకంతో ఈ చిత్రంను అయిదు కోట్ల వరకు పెట్టేందుకు కూడా సిద్దంగా ఉన్నారట.అయితే మొదట మూడు కోట్లతో సినిమాను ప్లాన్ చేస్తున్నారు.బడ్జెట్ పెరగడం, ప్రమోషన్స్ అన్ని కలిసి అయిదు కోట్ల వరకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
ఈ ముద్దుగుమ్మల జాయింట్ వెంచర్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
.