ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం.ప్రతిఒక్కరూ…సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నట్టే కనిపిస్తున్నారు.ఇదే సమయంలో చాలా స్పీడ్ గా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అయిపోతోంది.వీటిని అరికట్టేందుకు ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా… ప్రయోజనం మాత్రం కనిపించడంలేదు.అందుకే ఇప్పుడు ఫేస్ బుక్ ఈ నకిలీ వార్తల స్ప్రెడ్డింగ్ అరికట్టేందుకు సిద్ధం అవుతోంది.అందుకే… కథనాలను సమీక్షించడమే కాకుండా… ఫోటోలు, వీడియోల్లా కూడా అసత్యాలను గుర్తించి పరిశీలించేందుకు … కొన్ని రకాల టూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
వీటి ద్వారా… వార్తా కథనాలను సమీక్షించి ఖచ్చితమైన రేటింగ్ ఇస్తారట.దీనికోసం ఇప్పటికే…ఇండియా టుడే గ్రూప్ , విశ్వాస్ న్యూస్ మొబైల్ ,ఫ్యాక్ట్స్ క్రిసెంటో సంస్థల సహకారం తీసుకోబోతున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.