పెళ్లి అంటే ఎక్కడలేని ఆనందం మొదలవుతుంది.ఇల్లంతా చుట్టాలు, స్నేహితులతో కళకళలాడుతుంది.
ఇక పెళ్లి మండపానికి వెళ్లే సమయంలో అయితే… ఇక చెప్పక్కర్లేదు.అంతా ధూమ్ ధామ్ గా రెడీ అయ్యి… బ్యాండ్ బాజా తో డాన్సులు వేసుకుంటూ ఆనందంగా సభారం చేసుంటూ… కల్యాణ మండపానికి వెళ్తుంటారు.
ఈ విధంగానే పెళ్ళికొడుకు అతను బంధుమిత్రులు అంతా కలిసి ఆనందంగా డాన్సులు చేసుకుంటూ పెళ్లి మండపం సమీపానికి చేరుకున్నారు.ఇంతలో అకస్మాత్తుగా శబ్దం.
అంత తేరుకుని చూసేసరికి వరుడు అతని బంధువులు కొంతమంది పెళ్లి మండపం దగ్గర ఉన్నారు.దీంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.దీనికి సంబంధించి వివరాలను పరిశీలిస్తే
ఢిల్లీలోని నోయిడా ఘజియాబాద్ లోని ఇందిరా పురానికి చెందిన యాదవ్ అనే యువకుడికి సోనమ్ అనే యువతికి పెళ్లి ఫిక్స్ అయింది.ఫిబ్రవరి తొమ్మిదో తేదీన పెళ్లి ముహూర్తం ఈ సందర్భంగా ఊర్లో ఉన్న ఫంక్షన్ హాల్లో పెళ్లి వేదికను ముస్తాబు చేశారు.అయితే ఫంక్షన్ హాల్ కు రోడ్డుకు మధ్య మురికి కాలవ ఉంది.దీంతో మండపం నిర్వాహకులు తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు.అయితే ఈ విషయం తెలియని పెళ్ళికొడుకు బృందం హడావుడిగా డాన్సులు చేసుకుంటూ… ఆ తాత్కాలిక వంతెన పైకి చేరుకున్నారు దీంతో ఒక్కసారిగా ఉన్న కాస్త విరిగిపోయి కూడా వచ్చిన 14 మంది మురికి కాలంలో పడ్డారు.వెంటనే సమీపంలో ఉన్న వారు వారిని బయటికి తీసి ఆసుపత్రిలో చేర్చారు.
ఈ ఘటనకు కారణమైన ఆ ఫంక్షన్ హాలు నిర్వాహకులు తమ తప్పు ఒప్పుకున్నారు.ఈ ఘటనకు చింతిస్తూ మూడు లక్షల పరిహారం కూడా చెల్లించడంతో ఎటువంటి వివాదం లేకుండా ఆ గొడవ కాస్త సద్దుమణిగింది.