తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు చూస్తున్న ఎదురుచూపులు అంతా ఇంతా కాదు.అసలు పార్టీ అధికారం లోకి వచ్చి నెలలు గడుస్తున్నా….
కేసీఆర్ నాన్చుడు ధోరణి వీరికి మింగుడుపడంలేదు.ఇప్పటికే అనేక తేదీలు మారినా… ఏ తేదిమీద క్లారిటీ రాలేదు.అయితే… ఇప్పుడు ఫిబ్రవరి పదో తేదీ ఫైనల్ కాబోతోంది అనేది క్లారిటీ వచ్చింది.ఆదివారం వసంత పంచమి కావడం, శుభగడియలు కూడా ఉండడంతో ఆ రోజునే మంత్రి వర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు పార్టీ వర్గాల సమాచారం.
దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తిచేశారని ప్రచారం జరుగుతోంది.ఈనెల 20 తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.
లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకునే లక్ష్యంతో పావులు కదుపుతున్న కేసీఆర్.ఆ ఎన్నికల్లో పార్టీని సమన్వయం చేయడానికి వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే అంతా భావిస్తున్నట్టు 10 వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరగకపోతే …ఈ నెల 24వ తేదీన ఖచ్చితంగా విస్తరణ ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఎవరెవరికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుంది అనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఆశావాహులు మాత్రం ఎక్కువసంఖ్యలోనే ఉన్నారు.ఇక ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే….