చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన ఏపీ కేబినెట్ అనేక అనేక నిర్ణయాలు తీసుకుంది.మంత్రివర్గం నిర్ణయాలను రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాల్వ శ్రీనివాసులు మీడియా కు వివరించారు.
ఫార్మసిస్టు గ్రేడ్-2, లాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ అసిస్టెంట్, శానిటరీ అటెండర్/వాచ్మేన్ పోస్టులను ఔట్ సోర్సింగ్ సిబ్బందితో భర్తీ చేయాలని నిర్ణయం.నంద్యాలలో ప్రస్తుతం ఉన్న 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నతీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
వి
నూత్న నమూనాగా ఏలూరును అభివృద్ధి చేయాలని నిర్ణయం.సెమ్ కార్ప్ గాయత్రీ పవర్ లిమిటడ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు విధి విధానాల ఖరారు.ఏపీఈఆర్సీ ముందు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టేందుకు డిస్కమ్లకు గ్రీన్ సిగ్నల్.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించేందుకు కేబినెట్ అంగీకారం.కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్తో పాటు ఇతర సదుపాయాలు.12 నెలల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్.
a త్తూరు జిల్లా చంద్రగిరి మండలం కోటాల గ్రామంలో రూ.191.19 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం.1998, 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు విద్యాశాఖలో ఉద్యలు ఇవ్వాలని నిర్ణయం.జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లలో ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.