ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తోంది.దీనిలో భాగాంగానే… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త తరహాలో నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.
ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడే అవసరం లేకుండా టీటీడీ తరహాలో టోకెన్లు ఇస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.శుక్రవారం అమరావతిలో రాజకీయ పార్టీల నేతలతో జరిగిన భేటీ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ విధానం వల్ల ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.అయితే ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
.