ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ లకు స్దాన చలనం !

ఏపీలో 12 మంది ఐఏఎస్‌ల బదిలీ చేస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఎంకే మీనాకు పూర్తి బాధ్యతలు అప్పగించారు.

 Ias Ips Officers Transfers In Ap-TeluguStop.com

ప్రస్తుతం మీనా టూరిజం సెక్రటరీగా ఉన్నారు.హ్యాండ్లూమ్స్‌ కార్యదర్శిగా లక్ష్మీనరసింహం నియమించారు.

ప్రస్తుతం ఆయన ఎక్సైజ్‌ కమిషనర్‌గా ఉన్నారు.మైన్స్‌ సెక్రటరీగా నరేష్‌, పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు.

వీరితో పాటుగా కృష్ణా కలెక్టర్‌గా ఇంతియాజ్‌, శ్రీకాకుళం కలెక్టర్‌గా ఎం.రామారావు, టూరిజం డైరెక్టర్‌గా కె.ధనుంజయరెడ్డి….

గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, కృష్ణా జాయింట్‌ కలెక్టర్‌గా కృతికా శుక్లా….టీటీడీ జేఈవోగా లక్ష్మీకాంతంలకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.అదేవిధంగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కూడా బదిలీ చేశారు.

గుంటూరు రేంజ్‌ ఐజీగా ఆర్కే మీనా నియామించారు.ఏపీఎస్పీ బెటాలియన్‌ ఐజీగా కె.వి.వి.గోపాలరావు, మంగళగిరి ఏపీఎస్పీ కమాండెంట్‌గా గజరావు భూపాల్‌ను బదిలీ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube