ప్రముఖ విద్యావేత్త కె.వి.
విష్ణురాజు జనసేనలో చేరారు.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విష్ణు విద్యాసంస్థలు ద్వారా ఎన్నో కోర్సులు నిర్వహిస్తూ… బాగా పేరుపొందారు.
ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విష్ణు రాజు తాజాగా… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.విష్ణురాజును జనసేన సలహామండలి అధ్యక్షుడిగా నియమించారు.
విద్యావేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు కలిపి మొత్తం ఏడుగురు సభ్యులు ఉండే ఈ మండలికి విష్ణురాజు నాయకత్వం వహిస్తారని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.విష్ణు రాజుకి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఫౌండేషన్తో పాటు విష్ణు సిమెంట్ కంపెనీకి ఛైర్మన్గా కూడా ఉన్నారు.
తాజా వార్తలు