ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ – బీజేపీల మధ్య వైరం మరోసారి బయటపడింది.ఏపీలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో… ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఏపీ పర్యటన చేపట్టాడు.
ఈ రోజు శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన పర్యటనకు అడుగడుగునా ఆటంకం కలిగింది.ఆయన సభ నిర్వహించిన పలాసలో… టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
ఆయన పర్యటనను నిరసిస్తూ.నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
పలాసలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర.అమిత్ షా గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఆంధ్రా ద్రోహులు బీజేపీ నాయకులు.అమిత్ షా గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన టీడీపీ శ్రేణులు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్దం చేసేందుకు ప్రయత్నించారు.దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది.టీడీపీ కార్యకర్తలకు పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీష మద్దతు తెలిపారు.రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.ఏపీకి ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ గౌతు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.శివాజీ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బైఠాయించడంతో.పోలీసులు ఎంట్రీ ఇచ్చి గౌతు శివాజీని, శిరీషను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.ఈ నిరసనలు కొనసాగుతుండగానే అమిత్ షా పర్యటన కొనసాగింది.