ఒకే సామాజికవర్గం వర్గానికి చెందిన పోలీసు అధికారులుగా ఉన్నారని … వారు ఈ ఎన్నికల్లో పలు అవకతవకలు చేసే అవకాశం ఉన్నందున వెంటనే వారిని మార్చాలని వైసీపీ అధినేత డిమాండ్ చేశారు.ప్రస్తుత డీజీపీ ఆర్.
పి.ఠాకూర్, అడిషనల్ డిజిపి ఎబి వెంకటేశ్వరరావు, డిఐజి ఘట్టమనేని శ్రీనివాస్ లను ఎన్నికల సమయంలో బాధ్యతల నుంచి తప్పించాలని వైసీపీ అధినేత జగన్ కొత్త డిమాండ్ లేవనెత్తారు.ఏపీలో స్వేచ్చగా ఎన్నికలు జరగడానికి వీరు ఆటంకం కలిగిస్తారని ఎన్నికల కమిషన్ కు తెలియచేశామని ఆయన అన్నారు.
అంతే కాకుండా… టీడీపీ అధినేత సామాజికవర్గానికి చెందిన వారికే డీఎస్పీ ప్రమోషన్స్ ఇస్తున్నారని జగన్ ఆరోపించారు.చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారికే డిఎస్పి ప్రమోషన్లు ఇస్తున్నారని ఆయన అన్నారు.ప్రస్తుతం ఉన్న 37 మందిలో ముప్పై ఐదు మంది ఒకే సామాజికవర్గానికి చెందినవారేనని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారని, నాలుగు వేల కోట్ల రూపాయలు ఇందుకు వాడుతున్నారని ఆయన అన్నారు.ఈ రకంగా డబ్బు పంపిణీలో పోలీసు అధికారుల హస్తం ఉందని కూడా ఆయన అన్నారు.
ఈ విషయాలపై గవర్నర్ తదితరులకు కూడా ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు.