సీనియర్ నటి రమాప్రభ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికి కూడా అడపా దడపా చిత్రాల్లో నటిస్తున్న ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆమె మాజీ భర్త శరత్ బాబు మాత్రం సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.
రమాప్రభను పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించాడు.తన గురించి, అప్పటి తన పెళ్లి గురించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు.
శరత్ బాబు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తాను 22 ఏళ్ల వయసులో రమా ప్రభను పెళ్లి చేసుకున్నాను.నాకు ఆ సమయంలో అసలు ప్రపంచం ఏంటో తెలియదు, అప్పుడు జరిగింది పెళ్లి అని తాను భావించడం లేదు.
అది ఒక కలయిక మాత్రమే అనేది తన అభిప్రాయం.అవగాహణ వచ్చిన తర్వాత ఆమెతో నేను ఉండలేక పోయాను.ఆ సమయంలో ఆమె కూడా నా నుండి దూరంగా వెళ్లి పోయింది.పెళ్లి తర్వాత ఇద్దరం సినిమాల్లో నటించాం, బాగానే సంపాదించాం.
అయితే ఆమె ఆస్తులను నేనేం తీసుకోలేదు.
నా పేరు మీద ఉన్న ఒక ఆస్తిని అమ్మి రమాప్రభా మరియు ఆమె సోదరుడి పేరు మీద రెండు ఆస్తులను కొనుగోలు చేశాను.అవి ఇంకా వారి పేరుమీదే ఉన్నాయి.వాటి విలువ 50 కోట్లకు పైగానే ప్రస్తుతం ఉంది.
దాంతో పాటు చెన్నైలో రమాప్రభకు ఒక బంగ్లా ఉంది.అది ప్రస్తుతం పాతబడినా కూడా దాని విలువ కూడా కోట్లలోనే ఉంటుందని శరత్ బాబు చెప్పుకొచ్చాడు.
రమాప్రభ ఆర్థిక ఇబ్బందులు అనే మాట వాస్తవం కాదని, తనకంటే కూడా రమాప్రభకు మంచి ఆస్తులు ఉన్నట్లుగా శరత్బాబు చెప్పుకొచ్చాడు.మొత్తానికి రమాప్రభ విషయంలో శరత్ బాబు ఇచ్చిన క్లారిటీతే మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.