ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది.ఎందుకంటే ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ సినిమాలో హీరో, హీరోయిన్ ప్రేమించుకుంటారు.ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకుంటారు.
అయితే వారి ఇంట్లో ప్రేమకు ఒప్పుకోరు.దాంతో ప్రేమించిన వారిని వదిలి ఉండలేక ఇద్దరు కూడా అడవిలోకి పారిపోతారు.
ఆ అడవిలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు.హీరో పాలు అమ్ముకుంటూ, ఆ పని ఈ పని చేస్తూ ఉంటాడు.
అయితే వారిని విలన్స్ చివరకు పట్టేసుకుంటారు.అచ్చు అలాగే రియల్ లైఫ్ లో కూడా జరిగింది.
కేరళలో జరిగిన ఈ రియల్ ప్రేమ కథా సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళ ఇడుక్కి జిల్లాకు చెందిన పాతికేళ్ల అప్పుకుట్టిన్ మరియు 17 ఏళ్ల అమ్మాయి అనుపమలు ప్రేమించుకున్నారు.
ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా కలిసి పోయారు.వారిద్దరు విడి విడిగా ఉండలేమనుకున్నారు.అలా అని పెళ్లి చేసుకుంటామని చెబితే ఇంట్లో వారు ఒప్పుకోరు.అందుకే చేసేది లేక అడవిలోకి వెళ్లి పోయారట.
జనవరి 6వ తారీకున వీరిద్దరు కనిపించకుండా పోయారు.మొదట అనుపమ మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు.
అనుపమ తల్లిదండ్రులు మరియు ఆమె స్నేహితులను ఎంక్వౌరీ చేసిన తర్వాత ప్రేమలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు.వారిద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఏకంగా 75 మంది పోలీసు వారు పని చేయాల్సి వచ్చింది.చివరకు అడవిలో ఉంటున్నట్లుగా మొబైల్ సిగ్నల్స్ వల్ల వెళ్లడైంది.అడవిలో పళ్లు సంతలో అమ్ముకుంటూ, వస్తువులు కొనుగోలు చేస్తూ వాటితో కాళం వెళ్లదీస్తున్నారట.దాదాపు 23 రోజుల పాటు అడవిలో వారిద్దరు ఉన్నారు.అక్కడ ఒక గుహలో తల దాచుకున్నట్లుగా వెళ్లడయ్యింది.
అప్పుకుట్టిన్ పళ్లు అమ్మేందుకు అడవి బయటకు వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు.అతడిని గుహ వద్దకు తీసుకు వెళ్లి అమ్మాయిని కూడా తీసుకు వచ్చారు.
అమ్మాయిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు.దాంతో ఆమెను బాలిక సంరక్షణ కేంద్రంకు తరలించారు.ఆ అబ్బాయిని మాత్రం మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారు.అయితే అతడు మాత్రం నేను తీసుకు వెళ్లక పోతే అనుపమ ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించడం వల్లే అలా చేశానంటూ వాపోతున్నాడు.పోలీసులు అతడిని బాగా కొట్టారట.‘నువ్వు నేను’ ప్రేమ కథ కాస్త చివరకు తమిళ ‘కాదల్’ అదేనండి ‘ప్రేమిస్తే’ తరహాలో మారిపోయింది.పాపం ఆ అబ్బాయి ఇంకా జైల్లోనే మగ్గుతున్నట్లుగా స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది.