ఖమ్మం జెడ్పి చైర్పర్సన్ గడిపల్లి కవిత తన పదవికి రాజీనామా చేశారు.టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఆమె కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు.
దీనికి తోడు వ్యక్తిగత కారణాలు కూడా తోడవ్వడంతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపారు.అయితేఆమెకు టీఆర్ఎస్ లో అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడంతో రాజీనామా చేసినట్టు ఆమె అనుచరులు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన కవిత 2014లో రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీ చైర్పర్సర్గా ఎన్నికయ్యారు.అదీ కాకుండా… ఆమె మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మధిర టికెట్ ను కూడా ఆశించారు.కానీ ఆమెకు ఆ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆమె రాజీనామా చేయడం ….రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్నన్కు అందజేయడం టీఆర్ఎస్ కు మింగుడుపడడంలేదు.
తాజా వార్తలు