ఆంధ్రా అక్టోఫస్ గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ ఆంధ్ర – తెలంగాణ విడిపోయిన తరువాత రాజకీయాలకు స్వస్తి పలికాడు.అయితే మాత్రం సర్వేల పేరుతో రాజకీయ పార్టీలకు దగ్గరగానే ఉంటూ వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో పొలిటికల్ రీ ఎంట్రీ గురించి స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు.తాను వచ్చే ఎన్నికలలో పోటీచేస్తే… తెలంగాణ నుంచే చేస్తానని ఆయన తేల్చి చెప్పాడు.
ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగానే ఉన్నానని… ఒకవేళ రాజకీయాలలోకి వస్తే,తెలంగాణ నుంచే పోటీచేస్తానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రెండుగంటల భేటీ గురించి ప్రశ్నించగా, అది తన వ్యక్తిగతమని ఆయన అన్నారు.గతంలో కూడా చాలా సార్లు కలిశానని ఆయన అన్నారు.తాను మాట తప్పనని, పీక తెగినా ఇష్టమే తప్ప, మాట తప్పనని ఆయన వ్యాఖ్యానించారు.
తన వల్ల తప్పు జరిగిందని తేలితే క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు.అయితే మీరు ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతారా అనే ప్రశ్నకు కాదు అంటూ బాంబు పేల్చారు.
అంటే ఆయన ఏదో ఒక పార్టీలో చేరి తన జాతకాన్ని మార్చుకోవాలని చూస్తున్నట్టు అర్ధం అవుతోంది.