నాగచైతన్యతో కలిసి ‘సవ్యసాచి’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నిధి అగర్వాల్ ఆ తర్వాత సినిమాను అఖిల్తో చేసింది.రెండవ సినిమానే అఖిల్తో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అనుకున్నారు.
అఖిల్కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మిస్టర్ మజ్ను సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనుకుంది.నిధి అగర్వాల్కు వరుసగా ఆఫర్లు వస్తాయని అంతా భావించారు.
కాని మిస్టర్ మజ్ను చిత్రం దారుణంగా విఫలం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన మిస్టర్ మజ్ను పై చాలా నమ్మకం పెట్టుకున్న నిధి అగర్వాల్కు నిరాశే మిగిలింది.
‘మిస్టర్ మజ్ను’ చిత్రం పెద్దగా గుర్తింపు తీసుకు రాకపోవడంతో నిధి అగర్వాల్కు ఆఫర్లు కూడా రావడం లేదు.పూరి జగన్నాధ్, రామ్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ కోసం ఎంతో మంది హీరోయిన్స్ను సంప్రదించగా కొందరు ఫ్లాప్ కాంబో అంటూ నో చెప్పారు, కొందరు భారీ రేటును డిమాండ్ చేశారట.దాంతో నిధి అగర్వాల్ తక్కువ రేటుకు ఓకే చెప్పి ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.పూరి సొంత బ్యానర్ అవ్వడంతో బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఆ కారణంగానే ఈ చిత్రంలో నిధిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ కేవలం 10 లక్షల రూపాయల పారితోషికం మాత్రమే తీసుకుందని, ఒకవేళ సినిమా హిట్ అయితే మరో అయిదు లక్షల రూపాయలను ఇచ్చేందుకు పూరి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.ఈమద్య కాలంలో ఐటెం సాంగ్స్ కు కూడా భారీ రేట్లు తీసుకుంటున్నారు.కాని హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం మరీ చీప్గా పది లక్షల పారితోషికం తీసుకోవడం ఏంటని సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
తక్కువ పారితోషికం తీసుకుని ఎక్కువ సినిమాలు చేసి, అలా అయినా గుర్తింపు తెచ్చుకోవాలని ఈమె భావిస్తుందేమో.ఒకవేళ ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ అయితే కోటి రూపాయల పారితోషకం వెంటనే ఆమెకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అందుకే తెలివిగా నిధి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది.