తెలంగాణాలో లో టీఆరఎస్ అధికారంలోకి వచ్చి చాలా కాలం అయినా… ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు.దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడా.
ఎప్పుడా అంటూ ఎదురుచూపులు చూస్తున్నారు ఆశావాహులు.ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మంత్రివర్గ విస్తరణ త్వరగా చేపట్టాలని ఇక నాన్చకూడదని భావిస్తున్నారు.
అందుకే మంత్రివర్గ విస్తరణకు కొన్ని ముహుర్తాలు పరిశీలిస్తున్నారు.
ఫిబ్రవరి 3 ,4 ,10 తేదీల్లో ఏదో ఒక తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ చూస్తున్నాడు.ఈ మూడు రోజుల్లో మంచి ముహుర్తాలు ఉన్నట్టు పండితులు చెప్పడంతో కెసిఆర్ ఈ తేదీల్లో ఏదో ఒక తేదీని ఫైనల్ చేసి మంత్రివర్గాన్ని విస్తరించాలని చూస్తున్నారట.ఇక దీంతో ఆశావాహులు తమ తమ లాబీయింగ్ ల ద్వారా మంత్రివర్గ విస్తరణలో స్థానం దక్కేలా పావులు కదుపుతున్నారు.
.తాజా వార్తలు