ఎన్టీఆర్, చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చేత ఫైట్స్ చేయించి ఎంతో పేరు తెచ్చుకున్నారు స్టంట్ మాస్టర్ రాజు.స్టంట్ మాస్టర్ రాజు 2009లోనే గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.
ఒంగోలు ఆయన సొంత ఊరు.ప్రస్తుతం రాజు కుటుంబ సభ్యులు ఒంగోలు జిల్లాలోనే నివాసం ఉంటున్నారు.రాజు 67వ జయంతిని వేటపాలెంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాజు భార్య అనంత లక్ష్మి సంచలన కామెంట్స్ చేసారు.
ఎన్టీఆర్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు తన భర్త మంచి హిట్స్ ఇచ్చారని చెప్పారు.రాజు చనిపోయి 9 ఏళ్లు అవుతున్నా తమను సినీపరిశ్రమ కానీ, ప్రభుత్వాలు కానీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజు వద్ద చిరంజీవి ట్రైనింగ్ పొందారని, చాలా గొప్ప స్థాయికి ఎదిగారని, చివరకు ఆయన కూడా తమను పట్టించుకోలేదని అన్నారు.
రామ్ లక్ష్మణ్, బాహుబలి ఫైట్ మాస్టర్ సాల్మన్ రాజు కూడా తన భర్త శిష్యులేనని చెప్పారు.సాల్మన్ రాజుకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం కాని ఇండస్ట్రీ వారైనా ఆదుకోవాలని కోరింది.