భారత సంతతి హిందూ మహిళ గా, అందులోనూ రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి హిందూ భారత సంతతి మహిళగా తులసి గబ్బార్డ్ చరిత్ర సృష్టించారు.ఆమె వచ్చే ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేయనున్నారనే విషయం అందరికి తెలిసిందే.
అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి హిందూ మహిళగా పేరొందిన తులసి తన పోటీ పై ఈ నెల 11న ప్రకటన చేశారు.అయితే
తానూ భారత దేశ ప్రధాని మోడీ ని కలుసుకున్న సంగతి సోషల్ మీడియాలో , చూపించి తనపై మతం రంగు పులుముతున్నారని.భారత ప్రధానిని కలిస్తే తప్పేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, అప్పటి మంత్రి హిల్లరీ , ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ సైతం మోడీ ని కలిసారని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ఆమె అన్నారు.
తనపై కావాలనే కొందరు వ్యతిరేకులు మత ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.ఇదిలాఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న మరో భారత సంతతి మహిళ కమల హారీస్ తన ప్రచారాన్ని మొదలు పెట్టి దూసుకేళ్తున్నారు.కమలా సైతం డెమోక్రటిక్ పార్టీ తరుపున బరిలోకి దిగడం గమనార్హం.