తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్మయి ఒక సంచలనం.బాలీవుడ్కే పరిమితం అయ్యిందని భావించిన మీటూ ఉద్యమాన్ని సౌత్కు తీసుకు వచ్చింది.
లెజెండ్రీ రైటర్ ముత్తు పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది.తండ్రి వయసు ఉండే ఆ వ్యక్తి తనను లైంగికంగా వేదించిందని చెప్పాడు.
కూతురు వయసు ఉండే ఎంతో మంది అమ్మాయిలతో ఆయన ఆడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అప్పటి నుండి కూడా చిన్మయిపై వరుసగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఆమెను పట్టించుకునే వారు కరువయ్యారు.దాంతో ఆమె మరింతగా రెచ్చి పోతుంది.
ఆమద్య డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి ఆమెను తొలగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమమే చేసింది.
తనను డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి తప్పించినందుకు క్షమాపణలు చెప్పి మరీ మళ్లీ తనను తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న చిన్మయి తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న పలు లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది.
తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చెబుతూ ఉంటే కొందరు తనను దోషిగా చూస్తున్నారని, తాను ఎంతగా క్రుంగి పోతున్నానో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.నేనేదో తప్పు చేసినట్లుగా అంతా నన్ను దోషిగా చూస్తున్నారు.
కొందరు నన్ను అప్పుడు నీ రేటు ఎంత, ఇప్పుడు నీ రేటు ఎంతా అంటూ ప్రశ్నిస్తున్నారు.వారు నన్ను మానసికంగా వేదిస్తున్నారంటూ చిన్మయి పేర్కొంది.
సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తనను నీ రేటు ఎంతా అంటూ ప్రశ్నించాడు, అప్పుడు అతడికి నేను ఇచ్చిన సమాధానం.మీ ఇంట్లో ఉండే ఆడవారి రేటు నా రేటు ఒకటే అంటూ చెప్పాను.అయినా అతడు నాతో అసభ్యంగానే మాట్లాడాడు అంటూ చిన్మయి పేర్కొంది.అసలు అలాంటి నీచులు ఉన్నారని తల్చుకుంటేనే ఒల్లుమండిపోతుందని ఆవేశంతో మాట్లాడింది.చిన్మయికి తమిళ సినీ ఇండస్ట్రీ నుండి పెద్దగా మద్దతు రాకపోవడం మహిళ సంఘాలను కూడా ఆశ్చర్య పర్చుతుంది.ఇప్పటి వరకు పెద్దలు ఎవరు కూడా చిన్మయికి మద్దతుగా మాట్లాడింది లేదు.
కారణం ముత్తుతో వైరం ఎందుకనే ఉద్దేశ్యం.అందుకే చిన్మయి ఒంటరిదైంది.