తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.తెలుగు వర్షన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ హిందీలో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, కైరా అద్వానీ హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇటీవలే ఈ చిత్రంకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ అవ్వడంతో చిత్రం మీడియాలో నిలిచింది.
తాజాగా మరోసారి మీడియాలో వార్త అయ్యింది.
ఈసారి సీరియస్ విషయంతో కబీర్ సింగ్ వార్తల్లో నిలిచింది.కబీర్ సింగ్ చిత్రీకరణ జరుగుతున్న సెట్లో జనరేటర్ ఆపరేట్ చేసే రామ్ కుమార్ అనే వ్యక్తి ప్రమాదవశాత్త పెద్ద ఫ్యాన్కు తలిగాడు.దాంతో అతడి తలకు బలమైన గాయం అయ్యింది.
వెంటనే అతడిని హాస్పిటల్కు తీసుకు వెళ్లినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.వైధ్యులు దెబ్బ బలంగా తలగడంతో పాటు, రక్త స్రావం ఎక్కువ అవ్వడంతో అతడు వెంటనే చనిపోయాడని వైధ్యులు తెలియజేశారు.
రామ్ కుమార్ మరణంతో చిత్ర యూనిట్ సభ్యులు శోఖ సంద్రంలో మునిగి పోయారు.ఎంతో ఉత్సాహంగా పని చేస్తూ, అందరిని పలకరించే వ్యక్తి మరణించాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
రామ్ కుమార్ మరణంతో షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.రామ్ కుమార్ అంత్యక్రియల తర్వాత మళ్లీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ కుమార్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి ఎంక్వౌరీ చేస్తున్నారు.ఉత్తర ప్రదేశ్కు చెందిన రామ్ కుమార్ అయిదు సంవత్సరాలుగా షూటింగ్స్కు జనరేటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు.కాని చిన్న తప్పిదంతో పెద్ద ప్రమాదం జరిగి మృతి చెందాడు.చిత్ర యూనిట్ సభ్యులు రామ్ కుమార్ కుటుంబంకు ఆర్థిక సాయంను ప్రకటించింది.