తన వ్యూహాలు… ఎత్తుగడలతో… తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్.తెలంగాణ హీరోగా కీర్తించబడుతున్నాడు.
అయితే ఇప్పుడు ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ… హైకోర్టు లో పిటిషన్ వేశారు ఆయన నియోజకవర్గానికి చెందిన ఓ ఓటర్.వివరాల్లోకి వెళ్తే… అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని గజ్వేల్ ఓటరు శ్రీనివాస్ పిటీషన్ లో పేర్కొన్నారు.
కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం మొదటి అఫిడవిట్ లో 2 కేసులు మాత్రమే చూపారని శ్రీనివాస్ తెలిపారు.తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడు గా ప్రకటించాలని పిటీషన్ లో కోర్టును కోరారు.ఈ పిటిషన్ సోమవారం విచారణకు రాబోతోంది.