ప్రముఖసినీ నటి భానుప్రియ పైన బాలిక లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది.తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ ఏడాది కిందట తన కూతురు సంధ్యని చెన్నైలో భానుప్రియ నివాసంలో పనికి పెట్టింది.
ఏడాది కాలంగా కనీసం మాట్లాడనీయటం లేదని తల్లి ప్రభావతి ఆరోపించింది.
తన కుమార్తెకు ప్రస్తుతం 14ఏళ్ల వయసు అని ఆమె వివరించింది.
మొదట్లో తన కుమార్తెని తరచుగా ఇంటికి పంపుతూ, ఫోన్ లో మాట్లాడిస్తూ బాగానే ఉండేవారు.కానీ ఇప్పుడు తన కుమార్తెని వేధిస్తున్నారు అంటూ ప్రభావతి వాపోయింది.చైల్డ్ హెల్ప్ లైన్ వారికి ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు.వారి సాయంతో ప్రభావతి సామర్లకోట పోలీస్ స్టేషన్ లో భానుప్రియపై కేసు నమోదు చేసింది.
తన కుమార్తెని ఇంటికి పంపండి అని ప్రాధేయపడినా అంగీకరించడం లేదు.
ఈ విషయంపై భానుప్రియ గారు స్పందించారు.”నా పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తమ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన ఆ బాలిక దొంగతనానికి పాల్పడిన మాట వాస్తవమని భానుప్రియ ఆరోపించారు.తమ ఇంట్లో నుంచి దాదాపు లక్షా 50వేల డబ్బును, బంగారాన్ని, కెమెరాను, ఐప్యాడ్ను దొంగిలించిందని ఆమె ఆరోపించారు.
తొలుత నిజం చెప్పలేదని, నిలదీసి అడిగితే నిజం చెప్పిందని తెలిపారు.ఆ అమ్మాయిని తీసుకెళ్లమని వాళ్ల అమ్మకు ఫోన్ చేశామని.బాలిక దొంగిలించిన కొన్ని వస్తువులను ఆమె తిరిగి తీసుకొచ్చిందని భానుప్రియ చెప్పారు.మిగిలిన వస్తువులను తీసుకొస్తామని ఇంటికి వెళ్లిన బాలిక తల్లి చివరికి తమ పైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.”