ఏపీలో ప్రస్తుతం టీడీపీ జనసేన పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు టీడీపీతో పొత్తు లేదని చెప్తున్నా సరే పదేపదే టీడీపీ నేతలు పవన్ తో పొత్తు కోసం తహతహలాడుతున్నారు.
ఏ మాత్రం చిన్న అవకాసం దొరికినా సరే పొత్తు కోసం తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ప్రస్తుతం ఏపీలో టీజీ రగిల్చిన చలిమంట పై పవన్ కళ్యాణ్ నీళ్ళు పోసిన విషయం విధింతమే.
టీజీ మాటలకి పవన్ పవన్ వీరలెవిల్లో విరుచుకుపడుతున్నారు…వివాలలోకి వెళ్తే.
ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటె బాగుంటుంది అంటూ టీజీ చేసిన కామెంట్స్ కి పవన్ భారీ స్థాయిలో ఫైర్ అయ్యారు.ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ లు ఇచ్చారు.అయితే పవన్ వార్నింగ్ ఇచ్చిన తరువాత టీజీ తనకున్న కోపంతో ఎక్కడ పవన్ పై ఆ రేంజ్ లో విర్చుకు పడిపోతారో అని అందరూ భావించారు కాని టీజీ ఎంతో కూల్ గా జవాబు ఇవ్వడంతో ఒక్క సారిగా అందరూ షాక్ తిన్నారు.
టీజీ ఏంటి ఇంత కూల్ గా సమాధానం చెప్పడం ఏంటి అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.
జనసేనతో టీడీపీకి పొత్తు కుదిరితే బాగుంటుందని భావించానని అందులో తప్పు ఏముందని అన్నారు.
అయినా పవన్ నా పై ఇంతగా స్పందించెంతగా తానూ ఏమి చేశానని, నా అభిప్రాయం చెప్పడంలో తప్పులేదు కదా అంటూ కూల్ రిప్లై ఇచ్చారు.తాను కూడా తన పెద్దరికానికి తగ్గట్టుగానే స్పందిస్తున్నానని అన్నారు.
పార్టీ నేతలు, కార్యకర్తలకి ఆవేశాలు ఉన్నా పరవాలేదు కాని, పార్టీల అధినేతలకి మాత్రం ఈ ఆవేశాలు ఉండటం సరికాదని అన్నారు.
అయితే ఈ విషయంలో టీజీ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు.అసలు పోత్తుల విషయంలో కామెంట్స్ చేశారు అంటూ మండిపడ్డారు.ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటూ టీజీ కి బాబు తలంటేశారు.
కాని టీజీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రాబు ఉన్నారని అంటున్నాయి రాజకీయ వర్గాలు.ఎలాగోలా పవన్ ని తమ దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నా బాబు కావాలనే ఈ వ్యాఖ్యలు చేసి మీడియా ముందు హుందాగా ఉన్నారని అంటున్నారు.
అంతేకాదు టీజీ సహజంగానే ఎవరన్నా ఏమన్నా అంటే కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకంగా అన్నేసి మాటలు అన్నా సరే సైలెంట్ గా ఉన్నారంటే,టీజీ వెనుక బాబు ఉన్నట్లే అంటున్నారు విశ్లేషకులు.