'వినయ విధేయ రామ' నష్టాలు...సంచలన నిర్ణయం తీసుకున్న సినిమా నిర్మాత..!

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ.సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది.

 Dvv Danayya Returns Money To Vinaya Vidheya Rama Distributors-TeluguStop.com

సంక్రాంతికి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది.కానీ మెగా ఫాన్స్ ఆశలు తారుమారారయ్యి.

ఆడియన్స్ అంతా సగంలోనే వెళ్లిపోతున్నారు.సినిమా చూసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపించట్లేదు.

ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిన…ప్రస్తుతం బయ్యర్లు దాదాపు 25 కోట్ల వరకు నష్టపోతారనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రానికి 92 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

రంగస్థలం బ్లాక్ బస్టర్ అవ్వడంతో చాలా మంది బయర్స్ “వినయ విధేయ రామ” కొనడానికి ముందుకు వచ్చారు.కానీ ఈ చిత్రం నిరాశపరచడంతో సీడెడ్, గుంటూరు లాంటి ప్రాంతాల్లో తప్ప మిగిలిన ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ భారీ మొత్తంలో నష్టాలని ఎదుర్కొంటున్నారు.

ఓవర్సీస్ లో అయితే వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి.

దీనితో నిర్మాత డివివి దానయ్య రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు 50 లక్షల వరకు తిరిగి ఇచ్చేయనున్నారట.అలాగే మిగిలిన ప్రాంతాల బయ్యర్లని కూడా ఆదుకునేందుకు దానయ్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube