అమెరికాలో తెలుగు అసోసియేషన్ లలో ఉన్న అతిపెద్ద సంస్థలలో ఆటా ఒకటి.ఈ సంస్థ నుంచీ చేపట్టే కార్యక్రమాలు ఎంతో మంది తెలుగు ఎన్నారైలకి అమెరికాలో విశేష సేవలు అందించాయి.
తెలుగు సాంప్రదాయలని అమెరికాలో నిర్వహించడంలో ఆటాకి ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఎంతో మంది భాదిత తెలుగు ప్రవాసులకి, ఎన్నారై విద్యార్ధులకి విశేష సేవలు అందించారు కూడా.అమెరికా లో ఉండే తెలుగు వారికి మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలో సైతం ఆటా అన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది.అయితే తాజాగా జరిగిన ఆటా కమిటీ మీటింగ్ లో సంస్థకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా ) కి నూతన అధ్యక్షుడుగా పరమేష్ భీమ రెడ్డి నియమితులు అయ్యారు.ఈయన మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి.ఆటాలో కీలక సభ్యుడిగా ఉంటూ వచ్చిన ఆయన 2019-20 సంవత్సరానికి గాను నూతన అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టనున్నారు.