అక్కినేని ప్రిన్స్ అఖిల్ చేస్తున్న మూడవ ప్రయత్నం ‘మిస్టర్ మజ్ను’.మొదటి రెండు సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చాయి.
ప్రేక్షకులతో పాటు అఖిల్ కూడా మొదటి రెండు సినిమాల ఫలితాల వల్ల నిరాశలో ఉన్నాడు.మూడవ సినిమా కాస్త విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’ అంటూ చేస్తున్నాడు.
మూడవ సినిమాకు చాలా గ్యాప్ తీసుకుని మరీ చేశాడు.ఈ చిత్రం ఈనెల 25న రిపబ్లిక్ డే సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ట్రైలర్ చూసిన అభిమానులకు మరియు సినీ వర్గాల వారికి దిమ్మ తిరిగి బొమ్మ పడింది.ఎందుకంటే ఈ చిత్రం అచ్చు ‘ఆరంజ్’ చిత్రం మాదిరిగా ఉంది.ఆ చిత్రంలో హీరో చరణ్ తనకు లాంగ్ టైం ప్రేమల మీద నమ్మకం ఉండదని, కేవలం షార్ట్ టర్మ్ ప్రేమలో ఇష్టం అంటూ చెప్తాడు.
కాని హీరోయిన్ మాత్రం తనకు ఫుల్ లెంగ్త్ ప్రేమ కావాలంటూ ఆరాట పడుతూ ఉంటుంది.అచ్చు ఈ చిత్రంలో కూడా అఖిల్ తాను ఎంతో మంది అమ్మాయిలతో రిలేషన్ షిప్ పెట్టుకున్నాను.
అందులో అత్యధిక కాలం అంటే నెల రోజులు మాత్రమే అంటూ చెప్తాడు.
నెల రోజుల కంటే తక్కువ రోజులకే అమ్మాయిలను మార్చుతూ అంటే లవర్స్ను మార్చుతూ ఉంటాడన్న మాట.అఖిల్ ఇలాంటి పాత్రకు బాగానే సెట్ అవుతాడు.కాని ఆరంజ్ లాంటి స్టోరీ అయితే మాత్రం ఇది ఫలితం తారు మారు అయ్యే అవకాశం ఉందనిపిస్తుంది.
ఎంతో జాగ్రత్తలు తీసుకుని, కథ విషయంలో చాలా జాగ్రత్తలు పడ్డ తర్వాత నాగార్జున ఈ చిత్రాన్ని కమిట్ అయ్యి ఉంటాడు.
అఖిల్కు ఆరంజ్ వంటి కథను ఇచ్చి ఉండడు.సినిమా ట్రైలర్ చూస్తుంటే అలా అనిపిస్తుంది కాని, ఖచ్చితంగా విభిన్నంగా ఉంటుందని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ ఆరంజ్ మాదిరిగా ఉంటే మాత్రం పరిస్థితి ఏంటో.
అయినా ప్రేక్షకుల అభిరుచి మారింది, ఆరంజ్ లాంటి సినిమాలను కూడా ఇప్పుడు ఆధరించే అవకాశం లేకపోలేదు.