ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల నోటికి అడ్డూ … అదుపు ఉండదు.ముందూ… వెనుకా ఆలోచించకుండా … ఇష్టమొచ్చినట్టు హామీలు ఇవ్వడం… అసలు తాము ఏమి మాట్లాడుతున్నామో… ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో మర్చిపోయి ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించడం ఒక్క రాజకీయ నాయకులకు మాత్రమే చెల్లుతుంది.తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహాలో హామీ ఒకటి ఇచ్చి అభాసుపాలయ్యాడు.
గుంటూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన…రాజధానిలో ఇంటింటికి గ్యాస్, కరెంటుతో పాటు ఏసీ కూడా సరఫరా చేస్తామని చంద్రబాబు అన్నారు.దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారిందట.ఈ ఏసీ సరఫరా చేయడం ఏమిటో అర్దం కాక జనం తలగోక్కుంటున్నారు.
దీనిపై ఇప్పుడు పొలిటికల్ సెటైర్స్ కూడా పడుతున్నాయి.గతంలో సముద్రాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి అందరినీ షాక్కు గురి చేసాడు.
అలాగే మరోసారి … అమరావతి ప్రాంతంలో వేడి మరీ ఎక్కువగా ఉంటోందని… 10 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి అప్పట్లోనూ అభాసుపాలయ్యినా సంగతి తెలిసిందే.
తాజా వార్తలు