ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ – తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య ఏర్పడిన రాజకీయ స్నేహబంధం పై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెడుతుండగా….ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జగన్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే… ఇది రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయం.ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు సంబంధించి కేసీఆర్ కు జగన్ లేఖ రాశారు.
అంతర్ రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు వెంటనే… చేపట్టాలని కోరారు.పరస్పర బదిలీలపై కమిటీ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన వెంటనే ఉద్యోగుల బదిలీలు జరపాలని ఆయన కోరారు.