ఏపీలో తెలుగుదేశం పార్టీ… కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లబోతున్నట్టు గత కొంతకాలంగా … వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన కింది స్థాయి నాయకులు అందుకు సిద్దమయిపోయారు.అయితే ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ మాత్రం కనిపించలేదజు.
దీంతో అసలు ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే విషయంలో ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది.తెలంగాణ లో ఈ రెండు పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రజకూటమి ఘోరంగా దెబ్బతినడంతో.
ఈ అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, కుటుంబపెద్ద సోనియా గాంధీలకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన పళ్లంరాజు టీడీపీతో కాంగ్రెస్కి పొత్తులేదని తేల్చేశారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే రాష్ట్రంలో టీడీపీతో పొత్తులేదన్న అంశంలో పళ్లంరాజు స్పష్టత ఇచ్చి ఉంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.పళ్లంరాజు గత కేంద్ర కేబినెట్లో కీలకమైన రక్షణశాఖ మంత్రి పదవి నిర్వహించారు.
పళ్లంరాజు కుటుంబానికి, ఇందిరాగాంధీ కుటుంబానికి మూడు తరాల అనుబంధం ఉంది.పళ్లంరాజు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సైతం ఎటువంటి రాజకీయ వివాదాస్పదమైన ప్రకటనలు ఇచ్చేవారు కాదు.
కానీ ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు గురించి ఆయన క్లారిటీ ఇచ్చేయడంతో ఇక పొత్తు లేనట్టే అన్న విషయం అర్ధం అయిపొయింది.